![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -293 లో.. ధీరజ్ కి ప్రేమ అన్నం తినిపిస్తుంది. మరొకవైపు సాగర్ ఇల్లరికం గురించి నర్మద వాళ్ళ నాన్న మాట్లాడడంతో రామరాజు బాధపడతాడు. నా కుటుంబం అంటే చాలా ఇష్టం.. అందరం ఎప్పుడు కలిసే ఉండాలని వేదవతితో రామరాజు చెప్తూ ఎమోషనల్ అవుతాడు.
మరొకవైపు నీ హ్యాపీనెస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను.. కానీ, నేను మీ ఇంటికి వెళ్లినందుకు మా నాన్నకి సారీ చెప్పావంటే.. నేను చేసింది తప్పు అని అనుకుంటున్నావని నర్మదపై సాగర్ కోప్పడుతాడు. దాంతో సాగర్ కి నర్మద ముద్దు పెడుతుంది. సాగర్ కూల్ అవుతాడు.
మరుసటిరోజు శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే విశ్వ పిలిచి అమూల్యని అలా పక్కకి తీసుకొని రా అంటాడు. నేను తీసుకొని రానని శ్రీవల్లి అంటుంది. పది లక్షలు ఇచ్చింది రాయబారం నడపడానికే అని భద్రవతి అంటుంది. శ్రీవల్లి సరే అని వెళ్లిపోతుంటే.. నర్మద ఎదురుపడి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నావని అడుగుతుంది. వాళ్ళని మన జోలికి రావొద్దని తిడుతున్నానని శ్రీవల్లి చెప్తుంది.
ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. ఇప్పుడు అంతా సెట్ అయింది కదా నాతో బాగుండొచ్చు కదా అని శ్రీవల్లి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. చందు తనకి ముద్దుపెడతాడు. దాంతో మా అయన నాకు ముద్దు పెట్టాడని గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి. దాంతో అందరు వస్తారు. ఎందుకు అలా అరుస్తున్నావ్ నిన్న మా ఆయన పెట్టాడు.. మావయ్య కూడా అత్తయ్యకి ఎన్నో సార్లు పెట్టాడు.. మొన్న ధీరజ్ కూడా ప్రేమకి ముద్దు పెట్టాడు.. మేం ఇలాగే అరుస్తున్నామా అని నర్మద అంటుంది.
తరువాయి భాగంలో ధీరజ్ క్యాబ్ డ్రైవర్ గా వెళ్తుంటే.. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది.. ఈ రోజు వద్దు అని ప్రేమ అంటున్నా కూడా ధీరజ్ వెళ్తుంటే ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |